25-08-2025 12:16:00 PM
హైదరాబాద్: సోమవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(Revanth Reddy OU visit) ఉస్మానియా విశ్వవిద్యాలయ పర్యటనకు ముందు బీఆర్ఎస్ విద్యార్థి(BRS student leaders ) విభాగం అధ్యక్షుడు జి. శ్రీనివాస్ యాదవ్, మరికొందరు నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ... ఇచ్చిన హామీలు అమలు చేయమంటే అరెస్ట్ చేయడం హేయమైన చర్య అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కొన్ని విద్యార్థి సంఘాలు నిరసనకు ప్లాన్ చేస్తున్నందున క్యాంపస్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
పోలీసులు ముందస్తుగా విద్యార్థి నాయకులను అరెస్టు చేశారని, ఏదైనా నిరసనను విఫలం చేయడానికి క్యాంపస్లో ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ఓయూ పర్యటనలో భాగంగా 1,200 మంది విద్యార్థులకు వసతి కల్పించే రూ.80 కోట్లతో నిర్మించిన రెండు కొత్త హాస్టళ్లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రూ.10 కోట్లతో నిర్మించిన డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ను కూడా ఆయన ప్రారంభిస్తారు. గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించడానికి మరో రెండు హాస్టళ్ల నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇదిలా ఉండగా, భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) విద్యార్థుల అరెస్టులను ఖండించింది. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.