25-08-2025 12:04:22 PM
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో(Osmania University) కొత్తగా నిర్మించిన హాస్టళ్ల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఓయూ పర్యటనలో భాగంగా రూ. 90 కోట్లతో నిర్మించిన భవనాలకు రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. వసతి భవనాలు, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వేం నరేందర్ రెడ్డి, కోదండరామ్, ఓయూ వీసీ కూమార్ పాల్గొన్నారు. 20 ఏళ్లలో ఓయూకు వెళ్లి ప్రసంగించనున్న తొలి సీఎం రేవంత్ రెడ్డి కావడం విశేషం.