06-12-2024 01:02:08 AM
సూర్యాపేట, డిసెంబర్ 5 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం సుల్తానపూర్ తండా సమీపంలోని బస్సు స్టేజీ వెనుకల గురువారం వ్యక్తి హత్యకు గురయ్యాడు. భీమ్లాతండాకు చెందిన లారీ డ్రైవర్ పానుగోత్ పాచ్చ(31)ను గుర్తి తెలియని వ్యక్తులు దారుణంగా చంపి చెట్ల పొదల్లో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.