1 June, 2026 | 2:26 PM

Breaking News

బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ తహసిల్దార్..   •   డాక్టర్ కళ్యాణికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు సన్మానం   •   విచారణకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి   •   నెల చివరి వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు   •   రామంతాపూర్‌లో RTC బస్సును ఢీకొట్టిన కారు   •   పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ   •   ఆయిల్ పామ్ నర్సరీలో నాణ్యమైన మొక్కలు సిద్ధం చేయాలి   •   అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క   •   BRS నేతల ముందస్తు అరెస్టులు.. అప్రజాస్వామికం   •   సీఎం జనజాతర సభకు మార్లవాయి గ్రామస్తుల భారీ తరలింపు   •  

నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు

28-01-2026 12:29 AM
  1. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం

ఫిబ్రవరి ౧న కేంద్ర బడ్జెట్.. చరిత్రలో తొలిసారి ఆదివారం ‘పద్దు’

ఇదే నెల ౧౩ వరకు మొదటి విడత సమావేశాలు

మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత

న్యూఢిల్లీ, జనవరి ౨౭: పార్లమెంట్‌లో బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీనిలో భాగంగానే మంగళవారం ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. మొదటి విడత సమావేశాలు ౨౮న మొదలై ఫిబ్రవరి ౧౩న ముగుస్తాయని, అలాగే రెండో విడత సమావేశాలు మార్చి 9న ప్రారంభమై ఏప్రిల్ 2న ముగుస్తాయని, సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రి కోరారు.

మరోవైపు సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గురువారం ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి ౧న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. భారత చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. బడ్జెట్‌పై పన్ను చెల్లింపుదారులు గంపెడాశలు పెట్టుకున్నారు. కేంద్రం కొత్త పన్ను విధానం తీసుకుచ్చి, తమపై పన్నుల భారం తగ్గిస్తుందని ఆశిస్తున్నారు.