calender_icon.png 19 July, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి డ్రగ్స్ లోన్ యాప్ లను అరికట్టాలి

18-07-2025 09:59:29 PM

డివైఎఫ్ఐ యువ చైతన్య సైకిల్ యాత్ర ను జయప్రదం చేయండి

కట్ట లింగస్వామి, మిర్యాల భరత్- డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శిలు

మునుగోడు,(విజయక్రాంతి): యువత పెడదారిన పట్టకుండా గంజాయి డ్రగ్స్ లోన్ యాప్ లను అరికట్టాలని డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శులు కట్ట లింగస్వామి,మిర్యాల భరత్ అన్నారు.  శుక్రవారం స్థానిక మండల కేంద్రంలో యువ చైతన్య సైకిల్ యాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని  జులై 24న నకరేకల్ లో ప్రారంభమై ఆగస్టు 02న మిర్యాలగూడ వరకు జరిగే యువ చైతన్య సైకిల్ యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

రాజీవ్ యువ వికాస్ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని అన్నారు. డివైఎఫ్ఐ యువతీ,యువకులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహిస్తూ దేశంలోనే అతిపెద్ద యువజన సంఘంగా ఉందన్నారు.సమాజంలో నేడు యువతను పట్టిపీడిస్తు, బానిసలుగా చేస్తున్న గంజాయి డ్రగ్స్ మరియు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లను అరికట్టి యువతను చైతన్యం చేయడానికి సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

గతంలో గంజాయి డ్రగ్స్ కు వ్యతిరేకంగా అనేకచోట్ల అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించామని గుర్తు చేశారు. దేశంలో యువత నేడు పలు రకాల వ్యసనాలకు బానిసలు అవుతు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారని అన్నారు. యువతీ యువకులు తెలిసి తెలవని వయసులో చేస్తున్నటువంటి అసాంఘిక కార్యకలాపాల వైపు యువత వెళ్లకుండా, వారి దగ్గరకు ట్రిక్స్ అనే మహమ్మారి దరి చేరకుండా యువతలో మార్పు తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు.