27 July, 2026 | 6:31 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

పంట చెన్లల్లో డ్రోన్ తో గంజాయి తనిఖీ: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి

14-10-2025 10:22 PM

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని పటేల్ తండా, గైరాన్ తండాలలో పత్తి పంటలు, కంది చెన్లను కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి, సిర్గాపూర్ ఎస్సై మహేష్ స్పెషల్ పార్టీ కలిసి డ్రోన్ కెమెరా ద్వారా మంగళవారం నాడు తనికి చేయ్యడం జరిగింది. స్పెషల్ పార్టీతో ప్రతి రోజు డ్రోన్ ద్వారా కంగ్టి, సిర్గాపూర్, కల్హేర్ మండలల్లో తనకి చేయ్యడం జరుగుతుందని సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు. ఎవరైనా గంజాయి సాగు చేస్తే కేసు నమోదు చేసి జైల్ కు పంపించడం జరుగుతోందని, ప్రభుత్వం నుండి వచ్చే అన్ని పథకాలు కూడా కట్ (నిలిపి వెయ్యడం) జరుగుతుందని, రైతు బంధు, కరెంట్ కనెక్షన్, ప్రభుత్వ బీమాలు అన్ని నిలిపివేయబడతాయని అన్నారు. కొత్త చట్టం ప్రకారం ఆస్తులను కూడా జప్తు చేయ్యడం జరుగుతయాని, ఎవరన్నా గంజాయి సాగు చేసిన పోలీస్ వారికి తెలియజేయాలి, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతయాని సీఐ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.