23 June, 2026 | 10:25 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

పశు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరం

24-01-2026 12:00 AM

అలంపూర్, జనవరి 23: మానవపాడు మండల పరిధిలోని కొర్విపాడు గ్రామంలో శుక్రవారం ఉచిత పశు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరాన్ని పశువైద్యాధికారులు ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి జిల్లా పశువైద్యాధికారి డా. శివానంద స్వామి హాజరై మాట్లాడారు. ఈ శిబిరంలో పశువుల చెవులు పరీక్ష, గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స అందించడం గురించి ప్రజలకు వివరించారు. అలాగే లేగ దూడల నట్టల నివారణ మందులు తాగించారు. చలికాలంలో పశువులకు వచ్చే రోగాల గురించి వివరించి తగు జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారులు డాక్టర్. పుష్పలత ,హరిప్రియ, విఎ బీసన్న, సూర్య రెడ్డి, గోపాలమిత్రలు, కావేరి అయ్యన్న, పరుశురాం గ్రామస్తులు పాల్గొన్నారు.