29-09-2025 01:03:41 AM
గ్రూప్-1 నిరుద్యోగ జేఏసీ డిమాండ్
ఖైరతాబాద్, సెప్టెంబర్ 28 (విజయ క్రాంతి): గ్రూప్-1 పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలని ఉద్యోగాలకు ఎంపికకాని పలువురు గ్రూప్-1 అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన గ్రూప్-1 నియామకాల ప్రక్రియ చట్టవి రుద్ధమని అన్నారు.
ఈ మేరకు ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి పలువురు గ్రూప్-1 అభ్యర్థులు గంగ భాస్కర్, రమ్య, ఝాన్సీరాణి, లక్ష్మి, జైలిసింగ్ బాలాజీ నాయక్, వెంకటేశ్ కరుణాకర్, మోహన్, రమావత్ మోహన్ తదితరులు మాట్లాడారు. గ్రూప్-1 పరీక్షపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పరీక్ష పూర్త య్యే ంత వరకు అవకతవకలే చోటు చేసుకున్నాయని ఆరోపించారు. గ్రూప్-1 పరీక్షకు 21,0 78 మంది దరఖాస్తు చేసుకొంటే, 21,0 88 మంది అభ్యర్థులు పరీక్ష ఎలా రాస్తారని ప్రశ్నించారు. యూపీఎస్సీ తరహాలో బ్లూ ప్రింట్ తీయకుండా మూల్యాంకనం చేయడంతో అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు.