26 May, 2026 | 6:34 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

ఖేలో ఇండియా ఖోఖో సెంటర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు

11-10-2025 12:27 AM

సుల్తానాబాద్, అక్టోబర్ 10 (విజయ క్రాంతి):కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నడుస్తున్న  ఖేలో ఇండియా కోకో సెంటర్ లో శుక్రవారం సీసీ కెమెరాలు అమర్చారు. కోకో కోర్టుకు నాలుగు వైపుల నాలుగు కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా యోజన క్రీడా శాఖ అధికారి సురేష్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఖేలో ఇండియా సెంటర్లు నడుస్తున్న సందర్భంగా సుల్తానాబాద్ లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ స్పోరట్స్ క్లబ్ అధ్యక్షులు ఎం , రవీందర్, ఖేలో ఇండియా కోకో సెంటర్ కోచ్ , మాజీ భారత కోకో జట్టు క్రీడాకారుడు గెల్లు మధుకర్ యాదవ్ తో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు.