10 April, 2026 | 5:36 PM

Breaking News

తంగళ్ళపల్లిలో ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ క్రికెట్ కప్ 2026 క్రీడా పోటీలు   •   రాష్ట్ర కో కన్వీనర్ గా బద్రి శీను   •   ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •  

ఇంటర్‌లో మార్పులు సరికాదు

26-10-2025 12:32 AM
  1. ఇంటర్నల్స్ మార్కుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల నిర్ణయంతో ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకే మేలు జరుగుతుందని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్‌రెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. ఇంటర్నల్ మార్కుల నిర్ణయాన్ని ఇంటర్ బోర్డు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల తల్లిదండ్రులు, నిపుణు లు, అధ్యాపకులతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాద న్నారు. ఇంటర్నల్స్ ప్రవేశపెట్టి పరీక్షలను నామమాత్రంగా చేసి, కార్పొరేట్ శక్తుల్లో పరీక్షల నిర్వహణను అప్పగించడమే అవుతుం దని విమర్శించారు. ఈ ఆనాలోచిత నిర్ణయాలను ఇంటర్ బోర్డు అధికారులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.