10 April, 2026 | 3:54 PM

Breaking News

టూ వీలర్ తో మెకానిక్ చేస్తూ... ఉపాధి   •   అన్నా.. నన్ను దేవుడే పంపిండు— కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగం   •   ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •  

పాత పెన్షన్ విధానం అమలు చేయాలి

26-10-2025 12:33 AM
  1. కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం
  2. నవంబర్ 25న ‘చలో ఢిల్లీ’ నిర్వహిస్తాం
  3. ఎన్‌ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాం తి): యూపీఎస్ వద్దంటూ, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్‌ఎంఓపీఎస్) ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభను నవంబర్ 25న నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఎంఓపిఎస్ సెక్రటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ తెలిపారు. యూపీఎస్ అనేది ఒక విఫల పథకం అని, అందులో చేరడానికి తేదీని మూడు సార్లు కేంద్రం పొడిగించిందని, మూడు సార్లు సవరించినా కేవలం 3 నుండి 4 శాతం ఉద్యోగులు మాత్రమే దాన్ని ఎంచుకున్నారన్నారు. 

ఢిల్లీలో నిర్వహించే ఈ భారీ నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ర్ట ప్రభుత్వాల ఉద్యోగ ఉపాధ్యాయులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే, ఆర్డినన్స్ మొదలైన శాఖల ఉద్యోగులందరూ భారీ సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. అదే విధంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులను ఆందోళన కలిగిస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షపై రివ్యూ చేయాలని, ఆర్టీఈ చట్టాన్ని సవరించాలన్న డిమాండ్లతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు.