11-02-2025 12:00:00 AM
నల్లగొండ, ఫిబ్రవరి 1౦ (విజయక్రాంతి) : నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆల య హుండీలను మంగళవారం లెక్కించను న్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆలయ మహామండపంలో స్వామి వారి హుండీని లెక్కించనున్నట్లు ఆయన పేర్కొ న్నారు. దేవాలయ సిబ్బంది, అర్చకులు, ఇతర సిబ్బంది విధిగా లెక్కింపులో పాల్గొ నాలని సూచించారు. అనుమతి లేకుండా గైరాజరైతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు