24-11-2025 04:37:27 PM
గువాహటి: బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా మూడో రోజు టిమిండియాకు దక్షిణాఫ్రికాకు మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 201 పరుగులకే భారత్ ఆలౌటైంది. ఆట ముగిసే సమయానికి భారత్ 95/1 నుండి 122/7కి పడిపోయింది. కేవలం 27 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. భారత్ జట్టుకు యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ తొలి వికెట్కు 65 పరుగులతో మంచి ఆరంభం లభించింది. ఆ తర్వాత రాహుల్ స్లిప్లో వెనుదిరిగారు. కెఎల్ రాహుల్ (22), జైస్వాల్ (58), సాయి సుదర్శన్ (15), ధ్రువ్ జురెల్ (0), రిషబ్ పంత్ (7), నితీష్ కుమార్ రెడ్డి (10), రవీంద్ర జడేజా (6) పరుగులో చేసి ఘోరంగా నిరాశపర్చారు. వాషింగ్టన్ సుందర్(48), కులీదీప్ యాదవ్(19), వీరు ఎనిమిదో వికెట్ కు 72 పరుగుల నెలకొల్పారు.
95/1 నుండి 122/7కి దిగజారడంతో భారత్ ఈ ఆరు వికెట్ల నష్టానికి 27 పరుగులు మాత్రమే చేసింది. 1966లో కోల్కతాలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఇంతకు ముందు అత్యల్ప స్కోరు 98/1 నుండి 139/7కి దిగజారింది, 41 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఇంతలో, దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసి 489 పరుగులు చేసింది. సెనురాన్ ముత్తుసామి తన తొలి టెస్ట్ సెంచరీని సాధించగా, మార్కో జాన్సెన్ 93 పరుగులు చేసి స్కోరుకు దారి చూపించారు. సౌతాఫ్రికా బౌలర్లో మార్కూ యాన్సెన్ (6), సైమన్ హర్మర్ (3), కేశమ్ మహరాజ్ ఒక వికెట్ తీశారు.