20-09-2025 03:17:27 PM
చిలుకూరు: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చేయూత పెన్షన్ దారుల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ శనివారం చిలుకూరు మండల కేంద్రంలోని వికలాంగుల హక్కుల పోరాట సమితి చేయూత పింఛన్దారుల ఎమ్మార్పీఎస్(MRPS) ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేయూత పెన్షన్ దారులు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొని, గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్ మాదిగ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు పెంచాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మల్లెపంగు సూరిబాబు మాదిగ, వికలాంగులు, చేయూత పెన్షన్ దారులు పాల్గొన్నారు.