ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ
07-04-2025 12:29 AM
మూసాపేట ఏప్రిల్ 6 : మండలం తుం కినీపూర్ గ్రామంలో ఆదివారం చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణను ఘ నంగా నిర్వహించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆదిత్య పరాశ్రీ స్వామి అభయ క్షేత్ర పీఠాధిపతులు దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి, దేవరకద్ర బిజెపి పార్టీ ఇంచార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి, ముసపేట మండల బిజెపి అధ్యక్షుడు టికే నరసింహు లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మూసాపేట మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, తదితరులు ఉన్నారు.




