calender_icon.png 11 June, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కారు బడుల్లో చదివిస్తేనే పిల్లలకు బంగారు భవిత

10-06-2025 12:00:00 AM

కొత్తపల్లి, జూన్9 (విజయాక్రాంతి): సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన ఉపాధ్యాయుల సమక్షంలో విద్యను అభ్యసించే అవకాశం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటుందన్న విషయం తల్లిదండ్రులు గ్రహించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.

బడిబాట కార్యక్రమంలో భాగంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్వంత ప్రచార వాహనంతో ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరిస్తూ కొత్తగా చేరిన పది మంది విద్యార్థులకు ప్రోత్సాహకంగా స్కూల్ బ్యాగులు స్వయంగా పంపిణీ చేశారు.

శాంతినగర్ లో జిల్లా విద్యాధికారి మొండయ్యతో కలిసి అధికారులు స్థానికులు తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సుడా చైర్మన్ మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాధాన్యతను తల్లిదండ్రులు గుర్తించాలని ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మేధావులు అన్ని రంగాలకు చెందిన వారు ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంఈవో ఆనందం, ప్రధానోపాధ్యా యులు స్థానిక నాయకులు మడుపు మోహన్,శ్రవణ్ నాయక్, లక్ష్మీనారాయణ,అనిల్ కుమార్, సుజాత,నిర్మల,రంగానాయక్, సత్యం గౌడ్,అజీమ్ నూర్,జమీర్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులుపాల్గొన్నారు.