calender_icon.png 23 August, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ సినీ అవార్డులకు ఎంపికైనవారికి సీఎం సన్మానం

19-08-2025 02:00:53 AM

71వ జాతీయ సినీ పురస్కారాల వేడుకలో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం అవార్డులకు ఎంపికైనవారిని సత్కరించారు. సీఎంతో సన్మానం అందుకున్నవారిలో ‘భగవంత్ కేసరి’ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మతోపాటు ఆ సినిమా విజువల్ ఎఫెక్ట్ సూపర్‌వైజర్స్ వెంకట్, శ్రీనివాస్, టీమ్ సభ్యులు, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ ఉన్నారు.

బేబి సినిమా డైరెక్టర్ సాయిరాజేశ్, సింగర్ రోహిత్‌లను కూడా సీఎం సన్మానించారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సినీ ప్రముఖులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబా ద్‌ను నిలపాలని ముఖ్యమంత్రి అన్నారు. సినిమా రంగం ప్రోత్సాహాకానికి అవసరమైన చేయూతనందిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ సినిమా నిర్మాతలు చైతన్యరెడ్డి, నిరంజన్‌రెడ్డి, బేబి సినిమా నిర్మాత ఎస్‌కేఎన్, భగవంత్ కేసరి నిర్మాత సాహు గారపాటి తదితరులు పాల్గొన్నారు.