30-05-2025 12:00:00 AM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ, మే 29 (విజయ క్రాంతి): పేద ప్రజలకు ఆరోగ్య విషయంలో సీఎం సహాయనిధి వరం లాంటిదని, ప్రజా ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా కృషి చేస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం రోజున బాలసముద్రంలోని ప్రజా భవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం)లో 93 మంది లబ్ధిదారులకు 37 లక్షల 43 వేల 5 వందల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలకు ఆరోగ్య పరంగా అండగా నిలిచిందని, స్థానికంగా ప్రతి నెల సీఎం సహాయనిధి చెక్కుల లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అనారోగ్యంతో చికిత్స పొంది మా కార్యాలయంలో ఇచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సహాయం అందిస్తున్నామని చెప్పారు.
సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు ఎల్ ఓ సి ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తున్నామని అన్నారు. విద్యా, వైద్యం సమాపాలుగా అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.