calender_icon.png 25 June, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను బీఆర్ఎప్ పూర్తి చేయలేదు : సీఎం రేవంత్

24-06-2025 07:08:54 PM

హైదరాబాద్: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయమని, మహిళలు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు చేపట్టామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ పై విద్యుత్ శాఖతో ఒప్పందమని, మహిళలకు రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆదుకున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల విక్రయానికి చర్యలు తీసుకుంటూ శిల్పారామంలో 150 షాపుల ఏర్పాటుకు స్థలం కేటాయించామని తెలిపారు.

వెయ్యి బస్సులు కొని ఆర్టీసీకి మహిళలు అద్దెకు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని, 8 వేల ఐకేపీ కేంద్రాలను మహిళల చేతుల్లో పెట్టామన్నారు. గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలలు తీసుకువచ్చి స్కూళ్లో ఆహార పదార్థాల సరఫరా బాధ్యత స్వయం సహాయక సంఘాలకు అప్పగించామని గుర్తు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, 18 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రాజెక్టులను బీఆర్ఎప్ పార్టీ గత పదేళ్లలో పూర్తి చేయలేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎడారిగా మారిందని, కల్వకుర్తి ఆగిపోయింది.. బీమా, నెట్టెంపాడు పురోగతి లేదని మండిపడ్డారు. కోయిల్ సాగర్, దేవాదుల సీతారామ, ప్రాణహిత-చేవెళ్ల ఊసేలేదని, ప్రాణహిత-చేవెళ్ల పేరు, ఊరు మార్చి అంచనాలు పెంచి రూ.లక్ష కోట్లు కొల్లగొట్టారని విరుచుకుపడ్డారు. కాళేశ్వరం కట్టిన మూడేళ్లకే కూలేశ్వరమైందని సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు.