calender_icon.png 11 July, 2025 | 4:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడోబ్ సీఈవోతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

09-08-2024 04:00:20 PM

హైదరాబాద్: ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్‌ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి ప్రస్తుతం కాలిఫోర్నియాలో పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లలో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. అడోబీ సీఈవోతో సమావేశంలో సీఎం తోపాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ స్థాపన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు తదితర ప్రణాళికలపై ఆసక్తి కనబర్చిన శంతను నారాయణ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావడానికి అంగీకరించారు. స్ఫూర్తిదాయకమై వ్యక్తి, సిలికాన్ వ్యాలీలో అత్యంత గౌరవనీయులైన టెక్ విజనరీ శంతను నారాయణ్ ని కలవడం భావోద్వేగమైన అనుభూతి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచానికి హైదరాబాద్ అందించిన ప్రసిద్దుల్లో ఒకరు శాంతను నారాయణ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.