calender_icon.png 1 September, 2025 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే మా ప్రభుత్వ చిత్తశుద్ధి: సీఎం రేవంత్

31-08-2025 10:28:57 AM

హైదరాబాద్: బలహీనవర్గాలకు అనుమానం కలిగేలా తప్పుడు సమాచారం వ్యక్తి చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీలో కొనసాగుతున్న రెండో రోజు చర్చలో పేర్కొన్నారు. మొత్తం వివరాలు సేకరించేందుకు బీసీ కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని.. బీసీల్లో అపోహాలు సృష్టించే విధంగా గంగుల కమలాకర్ మాట్లాడుతున్నారని సీఎం ఆరోపించారు. గంగుల కమలాకర్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని.. బీసీ బిల్లుపై గంగుల కమలాకర్ కు సంపూర్ణ అవగాహన ఉందని భావిస్తున్నానని సీఎం తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా గంగుల కమలాకర్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని.. ఆరు నూరైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు.

మా ప్రభుత్వం చిత్తాశుద్ధితో వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ కు పంపామని.. గంగుల కమలాకర్ అభినందిస్తారని నాకు తెలుసు కానీ ఆయన వెనకున్న వాళ్లు ఒత్తిడి తెస్తున్నారని సీఎం పేర్కొన్నారు. బీసీ కమిషన్ కు ఇచ్చిన జీవో అయినా.. డెడికేటెడ్ కమిషన్ కు ఇచ్చిన జీవో అయినా.. చిత్తా శుద్ధితో వ్యవహరిస్తున్నామని, బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే మా ప్రభుత్వ చిత్తాశుద్ది అని సీఎం రేవంత్ అన్నారు. ఐదుసార్లు ప్రధానికి లేఖ రాశా.. అపాయింట్మెంట్ ఇవ్వలేదని, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు జంతర్ మంతర్ లో దీక్ష పెట్టామని సీఎం తెలిపారు. జంతర్ మంతర్ లో దీక్షకు దాదాపు 100 మంది పార్లమెంటు సభ్యులు మద్దతు పలికారని.. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు రాజ్యసభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు ఏం మాట్లాడలేదని అన్నారు. బలహీనవర్గాల వైపు మాట్లాడుతున్న గంగుల కమలాకర్ కూడా ఏం మాట్లాడలేదని సీఎం పేర్కొన్నారు.