calender_icon.png 26 August, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల విద్యార్థినికి అండగా సీఎం

14-08-2024 12:55:54 AM

కార్తీకకు ప్రభుత్వ ఖర్చుతో నిమ్స్‌లో వైద్యం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (విజయ క్రాంతి): గురుకుల పాఠశాల భవనం పై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కార్తీకకు సీఎం రేవంత్‌రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని సీఎం ఆయన కార్యాలయ అధికారులను ఆదేశించారు. ఈ  క్రమంలో సీఎం సూచన మేరకు కార్తీకకు నిమ్స్ లో వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం కార్తీక కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక ఈనెల 9న ప్రమాదవశాత్తు స్కూల్ మూడో అంతస్తు నుంచి పడిపోయింది.

దీంతో విద్యార్థిని నడుము భాగంలో తీవ్రగాయాలయ్యాయి. గురుకుల అధికారులు కార్తీకను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి, అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించారు. నిమ్స్ న్యూరో సర్జన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరుమల్ బృందం మంగళవారం కార్తీకకు ఆపరేషన్ నిర్వహించింది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా కార్తీక ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. వైద్యబృందం విద్యార్థి ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.