15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అభివృద్ధి పనులపై కలెక్టర్, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమీక్ష

31-10-2025 12:03 AM

బిచ్కుంద, అక్టోబర్ 30 (విజయ క్రాంతి):  కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి మరియు అన్ని శాఖల అధికారులతో గురువారం సుధీర్ఘ చర్చల్లో  జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  పాల్గొన్నారు..జుక్కల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులు,సమస్యలు మరియుపేదలకు అందుతున్న ప్రభుత్వ పథకాల గురించి చర్చించారు.

పనులు వేగవంతం చేయాలని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించే దిశగా కృషి చేయాలని సూచించారు..ముఖ్యంగా ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నది తన ఆశయం అని, దానికి అధికారులు అందరూ సహకరించి నిబద్ధతో పనిచేయాలనికోరారు.నియోజకవర్గంలో విద్యా, వైద్య వ్యవస్థలను మెరుగుపర్చాలని,దానికిఅనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు..పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడంలో రాజీపడబోమని తెలిపారు..