17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మెగా రక్తదాన శిబిరం

31-10-2025 12:04 AM

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహణ

హైదరాబాద్, అక్టోబర్ 30(విజయక్రాంతి) : పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గురువారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోన వైష్ణవి గార్డెన్స్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. గురునానక్ విద్యా సంస్థల విద్యార్థులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు.

గురునానక్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు, చైర్మన్ రవీందర్ సింగ్ కోహ్లీ మూడో వర్థంతిని పురస్కరించుకొని ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆయనకు పలువురు నివాళులర్పించారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కేపీవీ రాజు  స్వీయ పర్యవేక్షణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భం గా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం యువతలో సామాజిక బాధ్య తా భావాన్ని, సేవా తత్వాన్ని పెంపొందించే దిశగా ఒక ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

గురు నానక్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ మరియు ఛాన్సలర్ గగన్ డీప్ సింగ్ కోహ్లీ, మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ హెచ్‌ఎస్ సైనీ తమ సందేశంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఇలాంటి మానవతా దృక్పథం ఉన్న టువంటి కార్యక్రమంలో తమను కూడా భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.  అలాగే రక్తదానం చేసిన విద్యార్థులు, సిబ్బందిని అభినందించారు.