12-01-2026 06:07:39 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అటల్ పెన్షన్ యోజన లక్ష్యాన్ని అధికమించేందుకు కృషిచేసిన లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్ కు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సన్మానం చేశారు. జిల్లాలో ఈ పథకం ద్వారా 107% వృద్ధి సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, డిఆర్ఓ రత్న కళ్యాణి, సిపిఓ జీవరత్నం, జిల్లా అధికారులు ఉన్నారు.