17 April, 2026 | 2:30 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

గ్రంథాలయం విజ్ఞాన భాండాగారం

12-01-2026 09:05 PM

గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోహిత్

విజయక్రాంతి,పాపన్నపేట: గ్రంథాలయం విజ్ఞాన భాండాగారమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. మండలంలోని పొడిచన్ పల్లిలో సోమవారం ఎమ్మెల్యే రోహిత్ రావు చేతుల మీదుగా గ్రంథాలయాన్ని ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం ద్వారా నిరుద్యోగులకు వివిధ రకాల పుస్తకాలను చదువుకొని జ్ఞానం పెంచుకునే అవకాశం లభిస్తుందన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రంధాలయాన్ని నిరుద్యోగులు, యువకులు బాగా చదువుకుని ఉద్యోగాలు సాధించాలని ఆయన యువతకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సర్పంచ్ ఎర్ర వెంకయ్య, ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి, నాయకులు కుమార్ గౌడ్, యాదయ్య, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.