13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

గ్రంథాలయం విజ్ఞాన భాండాగారం

12-01-2026 09:05 PM

గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోహిత్

విజయక్రాంతి,పాపన్నపేట: గ్రంథాలయం విజ్ఞాన భాండాగారమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. మండలంలోని పొడిచన్ పల్లిలో సోమవారం ఎమ్మెల్యే రోహిత్ రావు చేతుల మీదుగా గ్రంథాలయాన్ని ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం ద్వారా నిరుద్యోగులకు వివిధ రకాల పుస్తకాలను చదువుకొని జ్ఞానం పెంచుకునే అవకాశం లభిస్తుందన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రంధాలయాన్ని నిరుద్యోగులు, యువకులు బాగా చదువుకుని ఉద్యోగాలు సాధించాలని ఆయన యువతకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సర్పంచ్ ఎర్ర వెంకయ్య, ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి, నాయకులు కుమార్ గౌడ్, యాదయ్య, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.