13 May, 2026 | 1:53 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

జిల్లాలో 1064 టోల్ ఫ్రీ నెంబర్ తో అవినీతికి అడ్డుకట్ట

09-12-2025 03:33 PM

అక్రమాల నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలి

అవినీతి నిరోధక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని  జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని ఆవరణలో  జిల్లా కలెక్టర్  అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి అవినీతి నిరోధక దినోత్సవం ను పురస్కరించుకొని  విజిలెన్స్ వారోత్సవాలు పోస్టర్ ను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ  ఉద్యోగులు, అధికారులు తమ విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉంటూ బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. మనమంతా నిబద్ధతతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, అవినీతి అక్రమాల నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలని, ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలను ఎవరైనా లంచం ఇవ్వమని వేధిస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవడం ప్రజల హక్కు  అని, ఆ హక్కును లంచం తో కొనవద్దని, ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఏ పని కోసం ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ప్రజలకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  విజిలెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.