15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

‘ప్రేరణ’ క్రీడలు విజయవంతం చేయాలి

28-01-2026 12:43 AM

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా

బోథ్, జనవరి 27 (విజయక్రాంతి): బోథ్ మండల కేంద్రంలో ఈనెల 28 నుండి నిర్వహించనున్న ‘ప్రేరణ’ (ఆదిలాబాద్ జిల్లా స్థాయి బాలికల క్రీడా, సాంస్కృతిక పోటీలు-2026) కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.  ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ ... క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

జనవరి 28 నుండి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు ‘బాలికా సాధికారత - ప్రతిభను గుర్తించడం - భవిష్యత్తు నిర్మాణం‘ అనే నినాదంతో ఈ క్రీడా సంబరాలు జరగనున్నయని తెలిపారు. కలెక్టర్ వెంట ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రవికుమార్, సంక్షేమ శాఖల అధికారులు మిల్కా, రాజలింగం, డిడి అంబాజీ, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.