16-12-2024 01:33:50 AM
సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పొంగులేటి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (విజయక్రాంతి): తెలంగాణలోని క్రైస్తవులకు ప్రభుత్వం నుంచి పూర్తి భద్రత, మద్దతు ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్లోని మార్థోమ చర్చిలో జరిగి న సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. తాను ఎంపీగా పోటీ చేసినపు డు క్రైస్తవులు పూర్తి మద్దతు పలికి సహకరించారని గుర్తు చేశారు. 150 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ చర్చికి తనను ఆహ్వానించి సత్కరించడం మర్చిపోలేనిదన్నారు. కార్యక్రమంలో రాజేశ్వరరావు, ప్రతినిధులు పాల్గొన్నారు.