16-11-2025 12:36:09 AM
కేసముద్రం మండలం అర్పణపల్లిలో ఘటన
మహబూబాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామ పరిధిలోని శ్రీ సాయి బాలాజీ గ్రానైట్ క్వారీలో శనివారం ప్రమాదవశాత్తు కంప్రెషర్ ట్రాక్టర్ ఫల్టీ కొట్టిం ది. ఈ ఘటనలో కంప్రెషర్ ట్రాక్టర్ ఓనర్, డ్రైవ ర్ గుంజ రాములు (53) దుర్మరణం పాలయ్యాడు. యాదగిరి భువనగిరి జిల్లా అడ్డగూడూరు గ్రామానికి చెందిన గుంజ రాములు తన కంప్రెసర్ ట్రాక్టర్ ద్వారా గ్రానై ట్ క్వారీలో పనులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సంఘటన స్థలాన్ని కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్ఐ క్రాంతి కిరణ్ సందర్శించారు. రాము లు మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరి యా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలిం చి కేసముద్రం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.