2 April, 2026 | 3:33 PM

Breaking News

కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సాకారం..   •   పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •  

అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది

05-10-2025 07:08 PM

ఏటూరునాగారంలో బాకీ కార్డుల పంపిణీ..

ఏటూరునాగారం (విజయక్రాంతి): తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో 420 హామీలు ఇచ్చి గద్దె నెక్కి తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిందని బిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఏటూరునాగారంలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కాక అభివృద్ధి విస్మరించిందని అన్నారు. గత ప్రభుత్వ హాయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తే ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం అవినీతిలో రాష్ట్రాన్ని ముందు ఉంచారని అన్నారు. స్థానిక సంస్థల్లో ప్రజలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.