15 March, 2026 | 7:26 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది

05-10-2025 07:08 PM

ఏటూరునాగారంలో బాకీ కార్డుల పంపిణీ..

ఏటూరునాగారం (విజయక్రాంతి): తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో 420 హామీలు ఇచ్చి గద్దె నెక్కి తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిందని బిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఏటూరునాగారంలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కాక అభివృద్ధి విస్మరించిందని అన్నారు. గత ప్రభుత్వ హాయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తే ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం అవినీతిలో రాష్ట్రాన్ని ముందు ఉంచారని అన్నారు. స్థానిక సంస్థల్లో ప్రజలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.