12 June, 2026 | 1:23 PM

Breaking News

ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •  

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలి

23-01-2026 12:14 AM

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

నాగర్ కర్నూల్, జనవరి 21 (విజయక్రాంతి): 6 గ్యారంటీలు, 420 మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బొంద పెట్టాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నాగ ర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13 వార్డుల్లో పర్యటించి ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో త్రాగునీటి సమస్య పెరిగిందన్నారు. తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్య ర్థులను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.