23 June, 2026 | 7:35 PM

Breaking News

ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •   వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ   •   చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత   •   పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌గా మిద్దెల సత్యనారాయణ   •  

నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

28-10-2025 04:32 PM

కలెక్టర్ కుమార్ దీపక్..

హాజీపూర్ (విజయక్రాంతి): భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. మంగళవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను రోడ్లు భవనాల శాఖ డీఈ సజ్జత్ భాషాతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలను ఏర్పాటు కోసం రూ, 216 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే వైద్యులు, సిబ్బంది సంఖ్య పెరుగుతుందని, అన్ని వసతులతో స్థానికంగానే వైద్యం అందుతుందన్నారు.