7 June, 2026 | 2:22 AM

డివైడర్ ను ఢీకొని కంటైనర్ బోల్తా

25-10-2025 05:59 PM

డిచ్​పల్లి (విజయక్రాంతి): డిచ్​పల్లి మండలం ధర్మారంలో ఓ కొరియర్ కంటైనర్​ వాహనం డివైడర్​ను ఢీకొట్టి బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కొరియర్ కంటైనర్ పార్సిళ్లతో నిజామాబాద్​కు వస్తుండగా శనివారం ఉదయం 5 గంటల సమీపములో బోల్తా పడింది. డ్రైవర్ నిద్రలో ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెల్సింది. డ్రైవర్​కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెనుకనుండి ఎ వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు వాపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని పరిశీలించారు. తీవ్రగాయలపాలయినా డ్రైవర్ ను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.