calender_icon.png 25 June, 2025 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షయ వ్యాధి, మలేరియా డెంగ్యూ వ్యాధుల నియంత్రణలో నిరంతర కృషి చేయాలి

25-06-2025 06:32:28 PM

ప్రజలలో ఉన్న అపోహలను తొలగించి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయాలి..

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్..

ములుగు (విజయక్రాంతి): క్షయ వ్యాధి, వర్షాకాలంలో వచ్చే కీటక జనిత వ్యాధులైన మలేరియా డెంగ్యూ వ్యాధుల నియంత్రణలో వైద్య ఆరోగ్యశాఖ నిరంతర కృషి చేయాలని, ప్రజలలో ఉన్న అపోహలను తొలగించి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.(District Collector Divakara T.S.) అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో క్షయవ్యాధి నిర్మూలన, కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో క్షయ వ్యాధి, వర్షాకాలంలో వచ్చే కీటక జనిత వ్యాధులైన మలేరియా డెంగ్యూ వ్యాధుల నియంత్రణలో వైద్య ఆరోగ్యశాఖ నిరంతర కృషి చేయాలని, ప్రజలలో ఉన్న అపోహలను తొలగించి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయాలని, జిల్లాలో ప్రతి గ్రామంలో వనరబుల్ గ్రూప్స్ వ్యక్తులను గుర్తించి, వారంలో రెండు రోజులు క్యాంపు మోడ్ మొబిలైజేషన్ ద్వారా ఆర్బిఎస్కే వాహనాలు, 108 వాహనాలలో తీసుకువచ్చి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏటూరునాగారంలో, ములుగు జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రులలో వారికి ఎక్స్రేతో పాటు సిబినాట్ పరీక్షలను చేయించాలని, అప్పుడే ఎక్కువ మందికి టీబీ వ్యాధిని గుర్తించవచ్చునని తెలిపారు.

క్షయ వ్యాధి వ్యాప్తి నిరోధించడం పట్ల అవగాహన కల్పించడంతో పాటు మంచి పోషకాహారాన్ని అందించాలని కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు. అనంతరం వర్షాకాలంలో వచ్చే మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ డయేరియా లాంటి వ్యాధుల నియంత్రణలో ఆశా కార్యకర్తలు ఫీవర్ సర్వే చేయడం, సర్వేలో పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు జ్వరం ఉన్నచో వారిపై ప్రత్యేక వైద్య సేవలను అందించాలని, ప్రతి రోజు 20 ఇంటింటి సందర్శనలో లార్వా డివాటరింగ్ చేయడం, దోమల అభివృద్ధి అరికట్టే చర్యల పట్ల అవగాహన పెంపొందించడం, ఆశా కార్యకర్తల "డ్రై డే", ఫీవర్ సర్వేలపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, సూపర్వైజర్లు నిరంతర పర్యవేక్షణ చేయడం లాంటి కార్యక్రమాలతో కీటక జనత వ్యాధులను అరికట్టవచ్చునని వివరించారు.

ప్రథమ చికిత్స కేంద్రాల ఆర్ఎంపి, పియంపిలు అర్హతకు మించి వైద్యము చేయకూడదని అధిక మోతాదులో యాంటీబయాటిక్ మందులను రోగులకు ఇవ్వకూడదని, మండల పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ మండలంలోని గ్రామ కార్యదర్శులతో మీటింగును నిర్వహించుకొని గ్రామాలలోనీ సానిటేషన్, పరిశుభ్రతపై చర్చించుకొని ప్రత్యేకమైన కార్యాచరణతో దోమల అభివృద్ధి నివారణ చర్యలు ఆంటీ లార్వా స్ప్రే, ఆయిల్ బాల్ వేయడం త్రాగునీటిని క్లోరినేషన్ చేయడం లాంటి కార్యక్రమాలతో మలేరియా డెంగ్యూ వ్యాధులను నియంత్రించవచ్చునని తెలిపారు.