25-06-2025 06:34:57 PM
పాపన్నపేట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు(MLC Shambipur Raju) బుధవారం దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారి ప్రసాదం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. వీరితో పాటు మెదక్ ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ పట్లోళ్ల విష్ణువర్ధన్ రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ళ మల్లికార్జున్ గౌడ్, యువ నాయకులు అజయ్, అంతోల్ల అభిలాష్, కిరణ్, అరుణ్, భువన చంద్ర తదితరులు ఉన్నారు.