24-06-2025 07:23:54 PM
నిర్మల్ (విజయక్రాంతి): పేద పిల్లలకు కార్పొరేటర్ స్థాయి విద్యను అందించేందుకు ప్రభుత్వం గిరిజన అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని అమలు చేస్తుందని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ జిల్లా ఇన్చార్జి అధికారి జాదవ్ అంబాజీ నాయక్(Jadhav Ambaji Nayak) తెలిపారు. మంగళవారం రాంనగర్ ఆశ్రమ గిరిజన పాఠశాలలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు లక్కీ ధార ఎంపిక చేశారు. మూడో తరగతిలో 13 మంది 5, 8 తరగతిలో 12 మంది ఎంపిక చేయడం జరిగిందని వీరందరికీ ప్రభుత్వమే ఎంపిక చేసిన కార్పొరేట్ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీనివాస్, శివాజీ తుకారాం ఉపాధ్యాయులు గజారాం పాల్గొన్నారు.