calender_icon.png 25 June, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్ల బ్యాడ్జీలు ధరించి పాత్రికేయుల నిరసన

24-06-2025 07:20:42 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని పాత్రికేయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులు పైడిమల్ల నర్సింగ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణ పాత్రికేయులు నల్లబాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణ ప్రెస్ క్లబ్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(Telangana Working Journalists Federation) మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి మధు మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా కొనసాగుతున్న పాత్రికేయ వర్గంపై అధికార పార్టీ నాయకులు దాడులు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

ప్రజా ప్రతినిధుల మెప్పుకోసం ప్రభుత్వ ఆస్తులపై ఇష్టారీతిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా దీనిపై వార్త రాసిన పాత్రికేయునిపై, పట్టణం పాత్రికేయులపై అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ లో ఇష్టారీతిన పోస్టులు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అధికార పార్టీ నాయకుల తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని ముప్పని దీనిపై కాంగ్రెస్ అధిష్టానం కఠిన చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

పట్టణ పాత్రికేయులు మాట్లాడుతూ... అధికార పార్టీ అండదండలు ఉన్నాయని విలేకరులపై ఇష్టారీతిన విరుచుకుపడితే సహించేది లేదని, వెంటనే ఆయనను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అంతవరకు పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్తలు బహిష్కరిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. తెలిపారు. పత్రికా వ్యవస్థ పై ఇష్టానుసారం వాట్సప్ వేదికగా పోస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని పోలీసులు వెంట్డనే కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు కామెర వెంకటస్వామి, శానగొండ శ్రీనాథ్, పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాండ్ల సంజీవ్, కోశాధికారి బూర్ల రాజకుమార్ లతో పాటు పట్టణ పాత్రికేయులు పాల్గొన్నారు.