21 August, 2026 | 10:09 PM

Breaking News

కొత్తగూడెంల జీజీహెచ్ త్వరలో క్యాథ్ ల్యాబ్ సేవలు: ఎమ్మెల్యే కూనంనేని   •   కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు పాటుపడడం అభినందనీయం   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి   •   నేరాల పెరుగుదలను అరికట్టాలి   •   గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్ ను పటిష్ట పరచాలి   •   సిరికొండ మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే   •   పేకాట స్థావరంపై పోలీసుల దాడులు   •   క్రిమినల్ కేసుల రాజీయే శాంతి స్థాపనకు మార్గం జిల్లా జడ్జి కే.మురళీమోహన్   •   ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •  

24వ డివిజన్‌లో రేషన్ కార్డులు పంపిణీ చేసిన కార్పొరేటర్ కమర్తపు మురళి

31-07-2025 12:00 AM

ఖమ్మం, జులై 30 ( విజయ క్రాంతి): 24వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి ఆధ్వర్యంలో బుధవారం రేషన్ కార్డులు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ పేద ప్రజలకు రేషన్ కార్డు అనేది ఒక వరం లాంటిదని , గత ప్రభుత్వం ఇవ్వలేని రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని అభివృద్ధిలో , సంక్షేమంలో ఈ ప్రభుత్వం ముందుందని అన్నారు . మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలోఖమ్మం నియోజవర్గంలో దాదాపు పదివేల రేషన్ కార్డు లు మంజూరు అయ్యాయని దీంతోపాటు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

గత ప్రభుత్వంలో పేద ప్రజలు రేషన్ కార్డు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందు లకు గురయ్యారు. ఈ సందర్భంగా రేషన్ కార్డు పొందిన ప్రతి ఒక్కరు సంతోషంగా హర్షం వ్య క్తం చేశారు. రేషన్ కార్డు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని దీనివల్ల సంక్షేమ ఫలాలు లభిస్తాయని కావున రేషన్ కార్డు లేనివాళ్లు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకుని కార్డును పొందాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో గంగిశెట్టి శ్రీనివాస్, షేక్ గౌస్, రేఖ లక్ష్మణ్ , వరద వెంకన్న , పొలురి నాగార్జున, సురపానేని సురేష్, సురపానేని రవీందర్, మహేష్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు రేఖ భార్గవి, మరికంటి అనూష , పొనుగొటి స్వప్న, యలమద్ది లక్ష్మి , జోయ మరియు డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు .