calender_icon.png 5 May, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్ పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు పర్యవేక్షించిన సీపీ గౌష్ ఆలం

05-05-2025 02:41:49 AM

కరీంనగర్ క్రైం, మే 4 (విజయ క్రాంతి): కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం జరిగిన నీట్ పరీక్ష బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ఏడు పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడటానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.