calender_icon.png 28 September, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొమ్మాటలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

28-09-2025 05:27:58 PM

దౌల్తాబాద్: మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో బిఆర్ఎస్ యువజన నాయకుడు నర్రా రాజేందర్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌ను మాజీ ఎంపీటీసీ గన్నమనేని మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, జట్టు భావన పెంపొందిస్తాయని పేర్కొన్నారు. యువత చదువుతో పాటు క్రీడలలోనూ రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.