28-09-2025 07:17:28 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా అడెల్లి పోచమ్మ ఆలయంలో ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి ఏ ఇంద్రకన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడెల్లి ఆలయ అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్న ఆయన తన హయాంలో గుడి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.