31 May, 2026 | 9:03 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

మేడారం జాతరకు 3.70 కోట్లు

24-01-2026 01:05 AM
  1. నిధులను విడుదల చేసిన కేంద్రం
  2.   4 రోజుల పాటు 30 ప్రత్యేక రైళ్లు
  3. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): కేంద్రప్రభుత్వం మేడారం జాతరకు రూ.3.70 కోట్లు విడుదల చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ నిధులను తన ప్రత్యేక చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ, గిరిజన మంత్రిత్వశాఖలు విడుదల చేశాయని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామర వాయి, మల్లూరు, బోగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించనుంది.

ఇందు కోసం ‘గిరిజన సర్క్యూట్’ పేరుతో గతంలో రూ.80 కోట్లతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా పలు అభివృద్ధి పనులను కూడా చేపట్టిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా, యూనెస్కో గుర్తింపు లభించిన రామప్ప దేవాలయ అభివృద్ధికి కూడా రూ.140 కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన పే ర్కొన్నారు. అమ్మవార్లకు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకోవడానికి రాష్ట్ర నలుమూలలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతర జరిగే నాలుగు రోజుల పాటు దక్షిణ మధ్య రైల్వే శాఖ 30 ప్రత్యేక రైళ్లను నడుపుతుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.