calender_icon.png 4 June, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేప పిల్లల పంపిణీ కోసం మత్స్యసొసైటీకి 125 కోట్లు కేటాయించాలి

31-05-2025 12:00:00 AM

తెలంగాణ ముదిరాజ్ మహాసభ 

ఖైరతాబాద్; మే 30 (విజయక్రాంతి) : మత్స్యసాసైటీకి ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం బడ్జెట్లో రూ.125 కోట్లు కేటాయించి సొసైటీ ఖాతాలలో నగదు జమ చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభరాష్ట్ర వర్కిం గ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం, ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు  శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల జిల్లా అధ్యక్షులు, చీప్ ప్రమోటర్స్ తో కలిసి వారు మీడియాతో మాట్లాడారు.

మత్స్యకార సహకార సంఘాలకు ఉచిత చేప పిల్లల పంపిణీకి టెండర్లు  పిలువాలని కోరారు. ముందుగా, గ్రామస్థాయిలో మత్స్య సహకార ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం మత్స్యసహకార సం ఘాల బలోపేతానికి కృషిచేసిందని గుర్తుచేశారు. చెరువులు కుంటలపై ముదిరాజ్, బెస్తలకు హక్కులు ఉండేలా చూడాలన్నారు. మత్స్యసొసైటీలోని సభ్యులందరికీ రూ.10లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేయాలని కోరారు.

దేశవ్యాప్తంగా 60 ఏళ్లు నిండిన మత్స్యకారులకు రూ.6వేల వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని కోరారు. సమావేశంలో మహాసభ ఉపాద్యక్షులు బల్ల సత్తయ్య, మాజీ అధ్యక్షులు లక్ష్మణ్, కనకయ్య ముదిరాజ్,  నేలు సోమయ్య, బాలు ముదిరాజ్, యాదగిరి, మన్నెరాజు తదితరులు పాల్గొన్నారు.