calender_icon.png 6 June, 2025 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిస్వార్థంగా ఆలయ అభివృద్ధికి కమిటీ ప్రతినిధులు కృషి చేయాలి

31-05-2025 12:00:00 AM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ 

కామారెడ్డి, మే 30 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ ఆలయ కమిటీ ఏర్పాటు చేసి నూతన ఆలయ కమిటీ ప్రతినిధులకు నియామక పత్రాలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అందజేశారు. 

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ  మాట్లాడుతూ  దేవుని ముందు అందరూ సమానులే అని, పట్టణంలోని పంచముఖి హనుమాన్ మందిరం చాలా ప్రాముఖ్యత కలిగినదని అన్నారు. ఆలయ కమిటీ  చైర్మన్ గా లింగాపూర్ గ్రామానికి చెందిన కిషన్ రావు, డైరెక్టర్లుగా నియామక పత్రాలు శుక్రవారం షబ్బీర్ అలీ అందజేశారు. పంచముఖి హనుమాన్, వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా వైద్య కిషన్ రావు. డైరెక్టర్లుగా   కొత్త భీమ్ రాజ్. దాసోజు శ్రీనివాస్, గంగ మని, శంకరయ్యలను నియమించడం జరిగిందన్నారు.

ఎంపికైన కమిటీలు ప్రతినిధులు నిస్వార్ధంగా ఆలయ అభివృద్ధికి పాటుపడాల న్నారు. కాంగ్రెస్ హయాంలో దేవాలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణ బాగా జరిగిందని  చెప్పారు. మన పాపాలు పోగొట్టి, పుణ్యాలు కలిగించే వాడే దేవుడు, అందుకే దేవుడు అందరివాడు అన్నారు. దైవ సన్నిధి ఆనందాన్ని పెంచుతుందని, అందరికి పంచుతుంది తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, పుట్నాల శ్రీనివాస్ యాదవ్, గుడుగుల శ్రీనివాస్, గణేష్, జమీల్, తదితరులు పాల్గొన్నారు.