calender_icon.png 16 June, 2025 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్టాండ్ కూలగొట్టండి... ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది

16-06-2025 12:19:44 AM

-పేద పండ్ల వ్యాపారులపై ఆర్టీసీ అధికారుల జులుం సరికాదు

-బస్టాండ్ ముందు వ్యాపారులతో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్ నగర్ జూన్ 15 (విజయ క్రాంతి) : ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భవనాలను అన్నిటిని కులుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం బస్టాండ్ కూడా ఎఫ్టీలు పరిధిలోనే ఉంది కాబట్టి ముందు బస్టాండ్ ను కూలిపీ తర్వాత పండ్ల వ్యాపారు దగ్గరికి రావాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందు ఉన్న పండ్ల వ్యాపారులను మాజీ మంత్రి ప్రతి కంగా కలిసి వారి సాధకబాధకులు విన్నారు.

ఈ సందర్భంగా మాజీమంత్రి మా ట్లాడుతూ ఆర్టీసీ అధికారులు పేద పండ్ల వ్యాపారులపై జు లుం ప్రదర్శించవద్దని,బస్టాండ్ మీద ఆధారపడి ఆటో డ్రైవ ర్స్.. పండ్ల వ్యాపారులు.. చిరు వ్యాపారుల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. వ పేదలకు ఒక న్యాయం.. మీకు ఇంకో న్యాయమా..? అని ప్రశ్నించారు. బస్టాండ్ తొలగించే వరకు వ్యాపారులు కూడా పోరన్నారు. బస్టాండ్ ముందు పేదలు పెట్టుకున్న పండ్ల షాపులు తొలగించవద్దని కోరారు. బస్టాండ్ ముందు ఉంటేనే వాళ్ళ వ్యాపారాలు జరిగి కుటుంబ పోషణ చేసుకునే అవకాశం ఉందని అన్నారు.

ప్రభుత్వానికి అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని, వ్యాపారాలు ఇక్క డే కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలా కాదని తొలగింపు ప్రక్రియ చేపడితే పెద్ద ఎత్తున ఆందోళనలు చెపడుతామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు చాలా ఉ న్నాయని, అవసరమైతే అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పా టు చేసుకోవాలని చెప్పారు. అవసరం అయితే పండ్లు అమ్మ కం చేసేందుకు ఆర్టీసీ నిర్మాణం చేసిన దుకాణాల ఉచితంగా ఇవ్వాలని కోరారు. రెంట్ ప్రభుత్వం చెల్లించే విధంగా చూడాలని చెప్పారు.

గతంలో ఇదే ప్రాంతంలో అత్యాధునిక ఫ్రూట్ మార్కెట్ కట్టాలని నిర్ణయం తీసుకొని ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వం కు పంపించమని పేర్కొన్నారు. ఏసీ లతో పాటు సోలార్ ఏర్పాటు చేయాలనీ నిర్ణయం తీసుకున్నాము. అధికారులకు పేదల పండ్ల షాపులు నామోషీగా అనిపిస్తే ప్రతి పాధనలకు అవసరమైనా నిధులు తీసుకువచ్చి కొత్త మార్కెట్ నిర్మాణం చేయాలనీ కోరారు.

పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచన తో వెయ్యి పడకల అస్పత్రి నిర్మాణం చెసినట్టు తెలిపారు. దీనితో వీరి వ్యాపారాలు కూడా చక్కగా సాగుతాయాని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, పట్టణ అధ్యక్షులు శివరాజ్, సీనియర్ నాయకులు రాంలక్ష్మణ్, శ్రీనివాస్ రెడ్డి, నవకాంత్, ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.