16-06-2025 12:20:00 AM
కరీంనగర్, జూన్ 15 (విజయ క్రాంతి): ప్రభుత్వ భూములు కబ్జా గురవుతున్న అధికారులు పట్టించుకోరా అని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆదివారం నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ రెవెన్యూ పరిధిలోని 574 సర్వే నంబర్ లో గల 14 ఎకరాల 8 గుంటల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని, ఆ భూ మిలో ప్రైవేటు విద్యాసంస్థ వారు ఆక్రమించి అందులో కళాశాల భవనాలు నిర్మించారని అన్నా రు.
కోర్టు విలువచేసే ఆ భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల పేదలకు ఇండ్ల స్థలాల కోసం భూ పోరాటం నిర్వహి స్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, క రీంనగర్ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, తిమ్మాపూర్ మండల కార్యదర్శి బోయిని తిరుపతి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి,నాయకులు మామిడిపల్లి హేమంత్ కుమార్పాల్గొన్నారు.