16-06-2025 12:13:53 AM
కరీంనగర్ క్రైం,జూన్15(విజయక్రాంతి): ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివి క్రమార్క జన్మదిన వేడుకలు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందిరా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్య క్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కు ప్రజల యొక్క అవసరాలు పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందన్నారు.
ప్రతిపక్ష నాయకులుగా పాదయాత్ర చే సి ఆనాడు ప్రజల గుండెల్లో నిలిచి పోయారని ప్రజల యొక్క ఆకాంక్ష లు తెలిసిన నాయకుడు భ ట్టివిక్రమార్క అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, ఎండి తాజ్,కొరివి అరుణ్ కుమార్,శ్రవణ్ నాయక్, దండి రవీందర్,దన్నాసింగ్,షభానా మహమ్మద్,ఊరడిలత,ముల్కల కవిత,తిరుమల,కీర్తి కుమార్, కిషన్ ,బషీర్, తదితరులుపాల్గొన్నారు.