16-12-2024 01:00:55 AM
నిజామాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బాపూజీ వచనాలయ అభివృద్ధికి సహకరించాలని రూరల్ ఎమ్మేల్యే భూపతిరెడ్డిని బాపూజీ వచనాలయ నూతన కమిటీ సభ్యులు కోరారు. నూతన పాలకమండలి అధ్యక్షుడు గడ్డం భక్తవత్సల్యం, మీసాల సుధాకర్తో పాటు కార్యవర్గ సభ్యులు భూపతిరెడ్డిని అదివారం కలిసి సన్మానించారు. నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి అందే సహకారాన్ని త్వరగా లభించేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు.