13 May, 2026 | 1:52 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

మూగజీవాలను పట్టించుకునేది ఎవరు?

15-09-2025 02:35 PM

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బజారువాడి, జనకాపూర్ తో పాటు ప్రధాన రోడ్డుపై పదుల సంఖ్యలో ఆవులు కనిపిస్తున్నాయి. యజమానులు వాటిని పట్టించుకోక ఆదరించే వారు కరువై ఘోషిస్తున్నాయి. వీటితో కాలనీలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మూగజీవాలకు తిండి కరువై అల్లాడుతున్నాయి. మున్సిపాలిటీ అధికారులు స్పందించి వెంటనే వాటిని గోశాలకు తరలించి సంరక్షించాలని గో ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.